Telugu Gateway
Telangana

ఇక నెక్స్ట్ కేజ్రీవాలే

ఇక నెక్స్ట్ కేజ్రీవాలే
X

జైలు నుంచే లేఖలు విడుదల చేస్తూ ఎన్నో సార్లు వార్తల్లో నిలిచాడు సుఖేశ్ చంద్రశేఖర్. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి గతం లో కూడా సుఖేష్ చంద్ర శేఖర్ పలు మార్లు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సారి అదే పని చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి...ఈడీ కస్టడీలో ఉన్న తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ గా లేఖ విడుదల చేశారు. కవితక్కా తీహార్ జైలు కు స్వాగతం అంటూ తన లేఖలో పేర్కొన్నారు. కవిత ను ఈడీ అరెస్ట్ చేయటం తో ఇన్నాళ్లూ తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది అని తన లేఖలో ప్రస్తావించారు. ఇన్నాళ్లకు నిజం బయటికొచ్చిందని.. చేసిన పనుల కర్మ ఫలం ఇప్పుడు వెంటాడుతోందని పేర్కొన్నారు. ‘‘నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ఎవరూ ఏమి చేయలేరని అనుకునేవారు. కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైంది. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి.

వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంగ్‌కాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటికొస్తాయి. ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను. అక్కా!..నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి. బయటపడే మార్గమే లేదు అక్కా. ఇప్పటికైనా నా విన్నపం ఒకటే. అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు, న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. ఇందుకు కావాల్సినంత సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి.ఈ లేఖను ముగించే ముందు మరొక మాట చెప్పదల్చుకున్నా.. ‘సినిమా ఇంకా మిగిలే ఉంది’. కేజ్రీవాల్ జీ.. తదుపరి ఇక మీరే. మీరు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది. కేజ్రీవాల్ జీ.. నా సోదరసోదరీమణులకు తీహార్ క్లబ్‌కు స్వాగతం పలుకుతున్నాను’’ అని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు.

Next Story
Share it